ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
విశాఖలో భయాందోళన సృష్టిస్తున్నారు
26 Jan 2017 11:08 AM
- బాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు
- రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు
- అక్రమంగా దళితుల భూములను లాక్కుంటున్నారు
- పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
- జాతీయ జెండాను ఆవిష్కరించిన వైయస్ జగన్
హైదరాబాద్ : సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వైయస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్నామా బ్రిటిష పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. 68 ఏళ్ల క్రితం మనం రాసుకున్న చట్టాలు ప్రస్తుతం అమలు అవుతున్నాయా అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నేతలను అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. విశాఖ ఆర్కే బీచ్ పరిసరాల్లో ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం వాకర్స్ను కూడా బీచ్ పరిసరాల్లోకి అనుమతించడంలేదన్నారు. విశాఖలో భయనక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు కాపు నేత ముద్రగడ, ఆయన కుటుంబసభ్యులను ఏ విధంగా హింసించారో మనం చూశామన్నారు. సాక్షాత్తూ చంద్రబాబే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చి తమ పార్టీలో చేర్చుకున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాసిన చట్టాలనే అపహాస్యం చేస్తున్నారన్నారు. దళితుల భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆక్షేపించారు. పట్టా భూములకు 1400 గజాలు, బీసీ, దళితుల భూములకు వెయ్యి గజాలు ఇస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నీరుగారుస్తున్నారన్నారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఫ్లెక్సీలు, టీవీల్లో గోడలపై జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఐదున్నర కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబును కాలర్ పట్టుకుని ప్రశ్నించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావడానికి కలిసికట్టుగా కృషిచేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.