టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
చంద్రబాబు నుంచి మంత్రుల దాకా నోరు తెరిస్తే అబద్ధాలేః వైఎస్ జగన్
14 Mar 2016 2:21 PM
హైదరాబాద్) అసెంబ్లీ లో తెలుగుదేశం నాయకుల తీరుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్న రీతిన టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో టీడీపీపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్బంగా మాట్లాడుతూ...తన మీద ఏవేవో అభాండాలు వేస్తున్నారని చెప్పారు. పరిటాల రవి హత్య విషయంలో ఆరోపణలు చేస్తున్నారని, కానీ, అటువంటి అంశానికి సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డిని ఎందుకు పార్టీ లో చేర్చుకొన్నారని సూటిగా ప్రశ్నించారు. కేసు మీద తీర్పు ఇచ్చేశాక కూడా మాట్లాడుతున్నారని, ఇటువంటి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలన్నారు.
వంగవీటి మోహన రంగా ను చంపించింది చంద్రబాబు నాయుడు అని అప్పటి మంత్రివర్గంలో ఉన్న చేగొండి హర రామజోగయ్య పుస్తకం రాశారని గుర్తు చేశారు. అప్పటి కేసులో ముద్దాయిలుగా ఉన్నవారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా అసెంబ్లీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పడు చంద్రబాబు నుంచి మంత్రుల దాకా అంతా నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని, అవాస్తవాలు మాట్లాడేందుకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు.