మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఖాళీ బిందెలతో వైయస్ జగన్ నిరసన
04 Dec 2017 7:12 PM
అనంతపురం: ఆరు నెలలకు ఒక మారు కూడా తాగునీరు అందడం లేదని సఖినేపల్లి తండా మహిళల వైయస్ జగన్కు వారి సమస్యను చెప్పుకున్నారు. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో వారు నిరసన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు చేరుకున్న మహిళలు వారి గోడును వైయస్ జగన్ ముందు వెల్లబోసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం మహిళలతో పాటుగా ఖాళీ బిందెలు పట్టుకొని వైయస్ జగన్ నిరసన వ్యక్తం చేశారు.