వడ్డీకే సరిపోవడం లేదు

ఏపీ అసెంబ్లీ: రుణమాఫీ కింద ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఇవాళ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్న అంశంపై చర్చ జరుగుతుండగా, మంత్రి వక్రీకరిస్తు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. మొన్న బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి రైతు ధర్మశ్రీ పేరు ఉటకరించారని గుర్తు చేశారు. ధర్మశ్రీ అనే రైతు  4.2.214న రూ.50 వేలు సోసైటీ నుంచి అప్పు తీసుకున్నారు. ఈయనకు ప్రభుత్వం ఇచ్చిన మొదటి ధపాకు రూ.6200 వడ్డీకి సరిపోయింది. అసలు 3200 ఇచ్చారు. మళ్లీ వడ్డీతో కలిసి ఇవాల్టికి రూ.50 వేలు దాటాయి. ప్రభుత్వం చెప్పినట్లు రూ.87వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి సంవత్సరానికి రూ.3 వేల కోట్లు ఇస్తే వడ్డీకి కూడా సరిపోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ మరోమారు మైక్‌ కట్‌ చేయడంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు.  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావ్‌కు మైక్‌ ఇచ్చి తింటించే ప్రయత్నం చేశారు. 


అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించి వీళ్లు చెప్పిన డేటా ప్రకారం రూ.8 వేల కోట్లు అవుతుందని చెప్పారు. సభలో అసత్యాలు చెప్పడం ధర్మమేనా? ప్రభుత్వ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఈ మూడేళ్లలో రూ.48 వేల కోట్లు వడ్డీ కట్టారని తెలిపారు.  ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రుణాలు మాఫీ చేయకపోవడంతోనే రైతులు మృత్యువాత పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు అందడం లేదు. 

రైతుల సమస్యలపై దద్దరిల్లిన సభ
రైతుల ఆత్మహత్యలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి అంశాలపై వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. రైతుల ఆత్మహత్యలపై వైయస్‌ జగన్‌ మాట్లాడుతుండగా స్పీకర్‌ మూడు సార్లు మైక్‌ కట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టగా స్పీకర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తూ మీకు అదే చేతనవుతుందని పరుష పదజాలంతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర నిరసనల మధ్య స్పీకర్‌ సభను మరోమారు వాయిదా వేశారు.
Back to Top