మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గిరిపుత్రుల్లో వెలుగునింపిన జననేత
06 Apr 2016 12:21 PM
వైఎస్సార్ జిల్లాః ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరికలతో అధికార యంత్రాంగం కదిలింది. పులివెందుల మండలం కనంపల్లె గిరిజన కాలనీకి అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కొన్ని వేల రూపాయల కరెంటు బిల్లులు అందజేసి.. వాటిని చెల్లించేవరకూ విద్యుత్ సరఫరా చేయబోమని అధికారులు తేల్చిచెప్పడం పట్ల ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
విద్యుత్ బకాయిలను చెల్లించలేదనే కారణంతో మార్చి 31వ తేదీ నుంచి కనంపల్లె ఎస్టీ కాలనీలో విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. పదేళ్ల బిల్లులు కడితేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో.. గిరిజనులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో గడిపారు. వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా సుమారు 70 మంది గిరిజనులు ఆయనను కలిసి తమ గోడు వివరించారు.
దీంతో చలించిన జననేత.. తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పులివెందుల రూరల్ ఏఈ పద్మనాభుడు ఆధ్వర్యంలో సిబ్బంది కనంపల్లెలోని గిరిజన కాలనీకి వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని గ్రామంలోని గిరిజనులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.