మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కేరళ వరద బాధితులకు వైయస్ జగన్ భారీ విరాళం
20 Aug 2018 1:08 PM
విశాఖ: కేరళ వరద బాధితులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు తమ పార్టీ తరఫున రూ. కోటి విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోటి విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు వైయస్ఆర్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీటిలో మునిగిపోయిన ఊళ్ల పరిస్థితి ఇంకా దైన్యంగానే ఉంది. దీంతో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనపడుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొన్ని చోట్లకు మాత్రం సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి..వైయస్ఆర్సీపీ తరఫున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.