ఢిల్లీ బయలుదేరిన వైయస్ జగన్..రాష్ట్రపతితో భేటీ

హైదరాబాద్: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో వైయస్ జగన్ భేటీ కానున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు వైయస్‌ జగన్‌ నేతృత్వంలో వైయస్సార్‌ సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్న తీరుపై వైయస్ జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.

Back to Top