మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు
25 Jul 2016 10:21 AM
విశాఖపట్నం)) గల్లంతైన విమానం ఆచూకీ
తెలుసుకొనేందుకు కేంద్రంతో మాట్లాడతామని, గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా తమ వంతు
ప్రయత్నం చేస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ హామీ
ఇచ్చారు. విశాఖ నగరంలో బాధితుల కుటుంబాల్ని ఆయన పలకరించి సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ విశాఖపట్నం పర్యటన ప్రారంభమైంది. మొదటగా 104 ఏరియాలోని భూపేంద్ర సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. విమానం గల్లంతైన రోజు జరిగిన పరిణామాలపై కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రక్షణ శాఖ ద్వారా జరుగుతున్న గాలింపు చర్యల వివరాలు తెలుసుకొన్నారు. “ఇటువంటి సంఘటనలు ఎంత బాధగా ఉంటాయో నాకు తెలుసు. అలనాడు వైయస్సార్ హెలికాప్టర్ మిస్ అయినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాం. ఆ రోజు ఎంతో కష్టం అనభవించాం, ఆ కష్టం నాకు తెలుసు” అని వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. పార్టీ తరపున కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.