రోడ్డు ప్రమాద బాధితులకు సంతాపం

కడప : వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లారీ లోయలో పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తీవ్ర సంతాపం తెలియచేశారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేయాలని వైఎస్ జగన్ కోరారు. 

Back to Top