వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  శ్రీనగర్ కాలనీ నాగార్జునగర్‌లోని స్వగృహంలో ఉదయం ఆయన మృతిచెందారు. 

తెలుగు జర్నలిజంలో హనుమంతరావుకు 65 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కృష్ణా పత్రిక, ఈనాడు, ఎకనమిక్ టైమ్స్ తదితర సంస్థల్లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. డేటా న్యూస్ ఫీచర్స్(డీఎన్‌ఎఫ్) ఏజెన్సీని స్థాపించి నిర్వహించారు. 

Back to Top