పులివెందులలో వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకలు

పులివెందుల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇవాళ ఉదయం క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు  క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అంతకు ముందు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అందరికీ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా ప్రార్థనలలో పాల్గొన్న వారి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
Back to Top