అన్న‌మ్మ‌ఘాట్ సెంట‌ర్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రచారం

కాకినాడః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్న‌మ్మ‌ఘాట్‌ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ ఆదివారం విస్తృతంగా ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. జ‌న‌నేత‌ను క‌లుసుకునేందుకు కాకినాడ ప్ర‌జానికం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చార‌ర‌థం ముందుకు సాగుతుంది. అన్న‌మ్మ‌ఘాట్ సెంట‌ర్‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడ‌ుతున్నారు.  మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డైరీ ఫామ్ సెంట‌ర్‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతారు. 

Back to Top