ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులు, సోదరీమణులకు బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశమన్నారు. బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు జరుపుకునే ఈ పండుగ త్యాగానికి చిహ్నమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు శాంతి, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు

Back to Top