ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
ప్రైవేటు టీచర్లందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు
25 Apr 2018 7:18 PM
కృష్ణా జిల్లా : ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, ప్రైవేటు టీచర్లందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని దావాజీగూడెం వద్ద బుధవారం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు కలుసుకున్నారు. తమ సమస్యలను జననేతకు వివరించారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల ఇబ్బందులపై వైయస్ జగన్ మాట్లాడారు. ప్రైవేటు టీచర్లకు ఒక ప్రత్యేక పద్దతి ద్వారా వేతనాలు ఇవ్వాలని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు మానవత్వంతో కనీసం వారానికి రెండు రోజులు సెలవులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
వైయస్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు అందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే విధంగా చట్ట సవరణ చేస్తామని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్ రోడ్డు, వెల్దిపాడు క్రాస్ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్ రోడ్డు, లంకపల్లి, వెంకట రామపురం మీదుగా ఈరోజు పాదయాత్ర సాగింది.