మాట త‌ప్ప‌ని మ‌డ‌మ తిప్ప‌ని నేత జ‌గ‌న్‌

తిరుమల:

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నేత అని  గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే  మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా అన్ని వర్గాలు సంక్షేమానికి వైయ‌స్‌ జగన్‌ నవరత్నాలు ప్రకటించారని గుర్తు చేశారు. అందులో దశలవారీగా మద్య నిషేదం అతి ముఖ్యమైందన్నారు. మహిళలకు వరమని, మద్యాన్ని నిషేదిస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందన్ని నారాయణస్వామి స్పష్టం చేశారు.

Back to Top