ఎంపీ దీక్ష భగ్నం

పోరుమామిళ్ల: వైయస్ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోరుమామిళ్ల ఎంపీటీసీ గౌస్‌పీర్‌ కుమారుడి ఆచూకిని కనుగొనాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి తరువాత బలవంతంగా దీక్ష భగ్నం చేసి.. పోలీస్‌ వాహనంలో అవినాష్ రెడ్డిని తరలించారు

తాజా వీడియోలు

Back to Top