వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉద్యోగాలు ఇవ్వనపుడు భూములు వెనక్కివ్వండి: అవినాశ్రెడ్డి
07 Feb 2015 3:52 PM
పులివెందుల: తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులకు ఉద్యోగాలు కల్పించనపుడు వారి భూములు తిరిగి ఇచ్చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో యురేనియం ప్రాజెక్టు అధికారులు అలీ, విజయ్లతోపాటు భూములు కోల్పోయిన రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆవినాశ్ మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా.. బాధితులకు ఇప్పటికీ పరిహారం, ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులు తమ పాసుపుస్తకాలు అందజేసి తమకు ఉద్యోగాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.