కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
ఉద్యోగం ఏది బాబూ..?
23 Aug 2018 1:03 PM
విశాఖ: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మింటి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లు అయినా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకపోవడం పట్ల యువత ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ జిల్లాలో ఎస్ఈజెడ్ అనే భూతద్దాన్ని చూపి యువతను మాయచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ యువత మండిపడుతున్నారు. గురువారం యలమంచిలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ను యువత పెద్ద ఎత్తున కలిశారు. చంద్రబాబు తమను మోసం చేశాడని జననేతకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలు వస్తున్నాయని, యువతకు ఉద్యోగాలు కలుగుతాయంటూ నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసమే పనిచేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని టీడీపీ నేతలు బంజారుభూములను దోచుకుంటున్నారని,క్వారీలను సొంతం చేసుకుని ఆక్రమ మైనింగ్లకు పాల్పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని స్థానికులు పేర్కొన్నారు.