బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
రాష్ట్ర ప్రజల ఆశల్ని చంపినందుకా సన్మానం..?
17 Sep 2016 2:30 PM
ప్రత్యేకహోదాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గొర్రెలు,మేకల మెడలో వేలాడే వాటితో పోల్చడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. ఏపీ ప్రజలను గొర్రెలు, మేకలతో పోలుస్తూ టీడీపీ, బీజేపీలు చులకనగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడికి సన్మానం దేనికోసం చేశారని.... రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని చంపేసినందుకా అని టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు. ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు బీజేపీతో చెప్పించడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల టీడీపీ, బీజేపీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.