రైల్వే జోన్ ఎప్పుడిస్తారు?

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌
ఢిల్లీ:  విశాఖ‌కు ఆరు నెల‌ల్లోగా ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇస్తామ‌ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నారు..ఇంత‌వ‌ర‌కు రైల్వే జోన్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. రైల్వే జోన్ ఎప్పుడిస్తార‌ని,  ఏపీకి ఇచ్చిన ఐదు వాగ్దానాలు ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. గురువారం రాజ్యసభలో రైల్వేస్ పనితీరుపై జ‌రిగిన  చర్చలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప‌లు అంశాలు లేవ‌నెత్తారు. ఎంపీ మాట్లాడుతూ.. ఏపీలో వివిధ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు రూ.3,406 కోట్లు కేటాయించినందుకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును అభినందించారు. రాష్ట్రానికి సురేష్ ప్రభు చేసిన 5 వాగ్ధానాలను విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.విశాఖ-చెన్నై, అమరావతి-బెంగలూరు హైస్పీడ్ రైల్వే లైన్లుగా మారుస్తామన్నారు, స్పెషల్ పర్పస్ వెహిల్ ద్వారా 21 రైల్వే స్టేషన్లను అభివృద్ధి ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. రైల్వే వ్యాగన్ ప్రాజెక్టుల పరిస్థితి ఎంతవరకు వచ్చిందని నిల‌దీశారు. విశాఖలో బుర్రా గుహలకు కొత్త విస్టా డోం వ్యాగన్లు ఇస్తామని చెప్పారు. మరి, ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధిని విస్మ‌రించార‌ని విమ‌ర్శించారు.  రైల్వే జోన్ ఎప్పటిలోపు వస్తుందో స‌మాధానం  చెప్పాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప‌ట్టుబ‌ట్టారు.

తాజా వీడియోలు

Back to Top