మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం
26 Jun 2018 5:42 PM
తూర్పుగోదావరి: ప్రతి రోజూ ప్రజలతోనే గడుపుతున్న మహానేత తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి, రాష్ట్రంలో రాజన్న పాలనను తిరిగి తీసుకుని వద్దామని ఎమ్మెల్సీ పిల్లు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జననేత వైయస్ జగన్ అమలాపురం నియోజకవర్గంలో 12 సార్లు పర్యటించి ఆయా వర్గాలను ఓదార్చి, బాధిత కుటుంబాలను ఆర్థిక సాయం చేసేందుకు వచ్చారన్నారు. గ్యాస్ బాధితులను పరామర్శించారన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని ఓదార్చారన్నారు. అమలాపురం వచ్చేందుకు మూడు వంతెనలు అవసరమని, వాటిని వైయస్ జగన్ నిర్మిస్తారని తెలిపారు.