అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చేనేత రంగం నిర్వీర్యం
10 Mar 2018 3:25 PM
ప్రకాశం: బీజేపీ, టీడీపీ పాలనలో చేనేత రంగం నిర్వీర్యమైందని చేనేత కార్మికులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 108వ రోజు చీరాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. వేటపాలెం గ్రామంలో చేనేత కార్మికులు వైయస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లాలో 70 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని వారు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. చేనేతలకు నివాస స్థలాలు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని చెప్పుకున్నారు. పవర్లూమ్స్ రావడంతో ఉపాధి కోల్పొతున్నామని చెప్పారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని వైయస్ జగన్కు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేతలు మేలు పొందారన్నారు. మహానేత పాలనలో 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చారన్నారు. విద్యా, వైద్యం, సంక్షేమం వంటి సమస్యలపై వైయస్ జగన్కు వివరించారు. వారి సమస్యలు విన్న జననేత మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని అందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు