మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఇళ్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా-ఎమ్మెల్యే ఆర్కే
29 May 2016 11:47 AM
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతికి రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించడం సరైన పద్దతి కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామస్తులు తమ ఇళ్ల తొలగింపులపై రామకృష్ణారెడ్డికి విన్నవించారు. ఉన్న ఇళ్లను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాల్లో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇళ్ల తొలగింపుపై న్యాయపోరాటం చేస్తానని వారికి హామీనిచ్చారు. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు సైతం చేసి బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.