<strong>అబద్దాల కోరు తో పోరాడుతున్నాం</strong><strong>అన్నీ మోసాలే అని జనం చెబుతున్నారు</strong><strong>కలిసి కట్టుగా పోరాటం చేద్దాం</strong><br/>కాకినాడ: చంద్రబాబుప్రభుత్వం పై కలిసి కట్టుగా పోరాడదామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. అబద్దాల కోరు, మోసం చేసే వ్యక్తితో మనం పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. కాకినాడ నుంచి మాజీ మంత్రి ముత్తా గోపాల క్రిష్ణ, ఆయన తనయుడు ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఎస్సార్సీపీ లో జరుగుతున్న సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత విధానాల్ని వైఎస్ జగన్ ఎండగట్టారు.<br/>మోసకారితో పోరాటంఒక అబద్దాల కోరు, ఒక మోసం చేసే వ్యక్తితో మనమంతా పోరాడుతున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఒక రైతు దగ్గరకు వెళ్లి పాలన ఎలా ఉందంటే రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు అని చెబుతున్నారని, ఒక మహిళ దగ్గరకు వెళ్లి పాలన ఎలా ఉందంటే రుణమాఫీ పేరుతో మోసాలు చేశారని చెబుతున్నారని వివరించారు. బాబు వస్తే జాబు వస్తుందని గొప్పలు చెప్పిన చంద్రబాబు అండ్ కో, ఇప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, అది ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భ్రతి ఇస్తామన్న హామీను కూడా నిలుపుకోలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇక, సామాన్యులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క ఇల్లు కట్టించ లేదని విశ్లేషించారు. ఇక, అవ్వా తాతల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వివరించారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు వేయలేదని, ఈ కారణంగా పెన్షన్లు నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. అసలు ప్రజల్లో లేని మనుషులతో జన్మభూమి కమిటీలు వేశారని, ఈ దిక్కుమాలిన కమిటీల సిఫార్సులతో ఉన్న పెన్షన్లు తొలగిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.<br/>ఇంతకు ముందు సామాన్యులకు కరెంటు బిల్లు నెలకు రూ. 200 వచ్చేదని, ఇప్పుడు రూ. 600 దాకా బిల్లులు మోతెక్కిస్తున్నాయని ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. రబీ సీజన్ మొదలైనా , ఇప్పటికీ నాట్లు వేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం పట్టిసీమ కడుతున్నారు, లంచాల కోసం ఏమైనా చేస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. బొగ్గు నుంచి మట్టి దాకా, మద్యం షాపుల నుంచి జీవో 22 దాకా అన్నింటా లంచాలు నడుస్తున్నాయి. దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తాడు అని వైఎస్ జగన్ వివరించారు.<br/>చివరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు వెళదామని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. అంతా ఆశీర్వదించాలని ఆయన అభిలషించారు.<strong><br/></strong><strong>బాధ్యతల పంపిణీ</strong>ఇదే సమావేశంలో వైఎస్ జగన్ నాయకుల మధ్య బాధ్యతల పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ నియోజక వర్గం కోర్డినేటర్ గా కన్న బాబు బాధ్యతలు తీసుకొంటారని, చెల్లుబోయిన వేణుగోపాల్ తో కలిసి పనిచేస్తారని వివరించారు. అలాగే కాకినాడ అర్బన్ నియోజకవర్గం కోర్డినేటర్ గా ముత్తా శశిధర్ బాధ్యతలు తీసుకొంటారని, ద్వారంపూడి చంద్రశేఖర్ తో కలిసి పనిచేస్తారని వివరించారు. అలాగే వేణుగోపాల్; చంద్రశేఖర్ చాలా మంచి వ్యక్తులు అనీ, వైఎస్సార్సీపీ కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తారని, రానున్న కాలంలో వాళ్లిద్దరికీ మరింత బాధ్యతలు అప్పగిస్తామని.. ఆ విషయాన్ని ఆ నాయకులే వెల్లడిస్తారని వైఎస్ జగన్ వివరించారు.