అమ‌రావ‌తిలోనే రాజధాని నిర్మాణం


- భూములిచ్చిన రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌
 
 
మంగళగిరి: అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని నిర్మాణం చేప‌డుతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్ల క్రిత‌మే చెప్పార‌ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వం భూసేకరణ నోటీసును ప్రకటించటంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆర్కే రైతులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రాజధానికి, పోలవరానికి వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకమంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూములిచ్చిన రైతులకు వైయ‌స్ఆర్ సీపీ అండగా ఉంటుందని, రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న భూములను వెనక్కివ్వడానికి సైతం వెనుకాడబోమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారని వివరించారు.  పోలవరం ప్రాజెక్టుకు అసలు ప్రతిపాదనలను చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అని, దాన్ని వైయ‌స్‌ జగన్‌ ఎలా అడ్డుకుంటారని ఆర్కే ప్రశ్నించారు. రాజధాని, పోలవరం పేర్లతో కోట్ల రూపాయిలు దండుకుంటున్న చంద్రబాబు అక్రమ సంపాదనకే వైయ‌స్ఆర్‌సీపీ అడ్డు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తానంటే ప్రపంచ బ్యాంకు వద్దకు ఎందుకు అప్పు కోసం వెళ్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పకుండా  వైయ‌స్ఆర్‌సీపీని విమర్శించడమేంటని ఆర్కే ప్రశ్నించారు.
 

Back to Top