వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల మలివిడత పరామర్శయాత్ర..!

వైఎస్ షర్మిలకు ఆత్మీయ స్వాగతం..!
రాజన్న బిడ్డకు జననీరాజనం...!
వరంగల్ః ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల..వరంగల్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేస్తున్నారు. రెండ్రోజుల పాటు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో 11 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు జిల్లాలో నల్వకాల్వ సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు ఆకుటుంబప్రతినిధిగా షర్మిల జిల్లాలో పర్యటిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు.  

బాధితులకు అండగా..!
మొదటివిడత యాత్రలో భాగంగా ఆగస్టు 24-28 వరకు జిల్లాలో మొత్తం 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆతర్వాత రెండో విడత పరామర్శయాత్రలో సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు మొత్తం 30 కుటుంబాలను షర్మిల ఓదార్చారు. మలివిడత పరామర్శయాత్ర కోసం  ఇవాళ హైదరాబాద్  లోటస్ పాండ్ నుండి బయలుదేరి వరంగల్ కు చేరుకున్నారు. 

మలివిడత పరామర్శయాత్ర..!
వరంగల్ జిల్లా మంగపేట మండలం బండారిగూడెంలో దోమగండి ముత్తయ్య, రాజుపేటలో దుబ్బ ముత్తయ్య, ఏటూరి నాగారంలో వలస చిన్నక్క, ఆతర్వాత గోవిందరావుపేట మండలం, దుంపెల్లిగూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి, చల్వాయిలో మేడపల్లి అమ్మాయమ్మ , బుస్సాపూర్ లో బేతి వెంకట్ రెడ్డి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. మంగళవారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించిన అనంతరం జిల్లాలో యాత్ర ముగిసి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మంథని నియోజకవర్గంలో మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 12 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు.

తాజా వీడియోలు

Back to Top