వైయస్‌ఆర్‌ జిల్లాలో వాక్‌ విత్‌ జగనన్న

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ నేతలు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ జిల్లాలోని చక్రాయపేట నాగులగుట్టపల్లిలో ‘వాక్‌ విత్‌ జగనన్న’ పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో నేతలు వైయస్‌ కొండారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
Back to Top