రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వ్యవసాయ వ్యతిరేకి చంద్రబాబు
01 Aug 2017 1:09 PM
అనంతపురం: చంద్రబాబు సర్కార్ వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరులో రైతులకు ఇన్పుట్ సబ్సీడీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వ్యవసాయాన్ని బాగు చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచుతున్నాడన్నారు. ఇన్పుట్ సబ్సీడీ, ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. అన్నదాతను మోసం చేస్తున్న టీడీపీ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.