మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
'ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'
02 Jan 2018 11:12 AM
చిత్తూరు: గ్రామస్థాయిలో మహిళాసంఘాలతో పని చేస్తున్న తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని ఐకేపీ వీవోఏలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం పునావాండ్లపల్లె గ్రామంలో వైయస్ జగన్ను వీవోఏలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం ఐకేపీలో గ్రామస్థాయిలో చిన్నతరగతి ఉద్యోగు లను నియమించుకొని మాతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలు ఇవ్వడంతో, ఐదారు నెలలకు ఒకసారి ఇవ్వడంతో కుటుంబ భారం అధికమవుతుందని, ఇందుకోసం ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచేలా ఒత్తిడి చేయాలని కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఆగితే మనందరి ప్రభుత్వం వస్తుందని, వీవోఏలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీపై ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.