వైయస్ వివేకా, అవినాష్ లను అడ్డుకున్న పోలీసులు

వైయస్ఆర్ కడప :  పైడిపాలెం రిజర్వాయర్‌ వద్దకు వెళుతున్న వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, మాజీమంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఇవాళ పైడిపాలెం జలాశయం ప్రారంభించనున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కోవరంగట్టుపల్లి వద్ద అవినాష్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.  వారిని గృహనిర‍్భంధం చేసేందుకు ప్రయత్నించారు. రిజర్వాయర్‌ వద్దకు వెళ్లకుండా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కార‍్యక్రమంలో పాల‍్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం జలాశయానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top