19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
భోగాపురంలో భూముల సర్వేపై ప్రజాగ్రహం..!
05 Nov 2015 2:49 PM
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెదకవులవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను స్థానికి ప్రజలు అడ్డుకున్నారు. భూ సేకరణకు సంబంధించిన విషయంపై కోర్టులో స్టే ఉండగా సర్వే ఎలా చేస్తారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇటీవలే ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భోగాపురంలో పర్యటించి రైతులకు అండగా నిలిచారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూదోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.