ధృవీకరణ పత్రం అందుకున్న సాయిరెడ్డి

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఈ ఊదయం అసెంబ్లీకి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నఅసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ  నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.

Back to Top