అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
విజయనగరంలో వైయస్ఆర్సిపి రక్తదాన శిబిరం
25 Feb 2013 1:25 PM
విజయనగరం, 25 ఫిబ్రవరి 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం లయిన్సు కల్యాణ మండపంలో సోమవారంనాడు రక్తదాన శిబిరం జరిగింది. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 50 మంది పార్టీ యువకులు రక్తదానం చేశారు. విజయనగరం ఏరియా ఆస్పత్రిలో రక్తం నిల్వలు తక్కువగా ఉండటంతో పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీలోని అన్ని విభాగాలూ చురుగ్గా పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవా కార్యక్రమాలు చేయాలన్నది శ్రీ జగన్మోహన్రెడ్డి ముందుండాలన్నది శ్రీ జగన్ ఆకాంక్ష అన్నారు. ఆ క్రమంలోనే విజయనగరంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.