విజయమ్మను కలిసిన దాడి వీరభద్రరావు

హైదరాబాద్, 04 మే 2013:

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు శనివారం సాయంత్రం లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాసానికి వెళ్ళారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తనయుడు రత్నాకర్ కూడా ఉన్నారు. విజయమ్మ వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

Back to Top