నిర్మలా సీతారామన్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం కలిశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన నిర్మాలాసీతారామన్‌ను కలిసి పలు అంశాలను ఆయన వివరించారు. విశాఖ డాక్‌యార్డ్‌ నియామకాల్లో ఎక్స్‌ అప్రెంటీస్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు. 
 
Back to Top