మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
విజయసాయిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
10 May 2016 6:31 PM
హైదరాబాద్) వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కి త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొనే ధర్నా కు హాజరు అయ్యేందుకు ఆయన ఉదయం బయలు దేరారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఓటర్ రింగ్ రోడ్డులో ప్రయాణిస్తుండగా రాజేంద్రనగర్ సమీపంలో కారు బోల్తా కొట్టింది. వాహనంలో విజయసాయిరెడ్డి తో పాటు ఉన్న ఇద్దరు పార్టీ నాయకులు, డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనంలో భద్రత చర్యలు తీసుకోవటంతో పెద్ద ప్రమాదం కలగకుండా బయట పడ్డారు. ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సను అందిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని ఆయన్ని పరామర్శించారు.
To read this article in English: http://bit.ly/279Fnns