వైయస్‌ జగన్‌ పాదయాత్రకు దేవుడి ఆశీస్సులు


వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు విజయచందర్‌
తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ వంటి నాయకుడు అవసరమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు విజయచందర్‌ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. పాదయాత్రకు వస్తున్న ప్రతి ఒక్కరిని వైయస్‌ జగన్‌ చెరగని చిరునవ్వుతో పలకరిస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ వెంట ఉంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. 
 
Back to Top