రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
'విద్యుత్ చార్జీల'పై వైయస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీ
08 Apr 2013 3:55 PM
హైదరాబాద్, 8 ఏప్రిల్ 2013: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉద్యమాలు ఊపందుకున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు సోమవారంనాడు ర్యాలీ నిర్వహించారు. కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలంటూ కంటోన్మెంట్ ప్రజలకు ఈ ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపన ప్రతాప్, వెంకట్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించారు.