మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నేరగాళ్లకు కొమ్మకాస్తున్న చంద్రబాబు
08 Jan 2018 3:05 PM
అనంతపురం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన చంద్రబాబు సర్కార్ నేరగాళ్లకు కొమ్ముకాస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి విమర్శించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. నేరస్తులను గుర్తించకపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. నేరం జరిగిన ప్రతీసారి చంద్రబాబు ఒక కమిటీని వేసి వాస్తవాలను సమాధి చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు బాబు పాలనలో అనేక కమిటీలు వేశారని, అయినా దాంట్లో ఒక్క వాస్తవం కూడా బయటపలేదన్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అని ప్రశ్నించారు. తాంత్రిక పూజలపై వాస్తవాలను బయటపెట్టాలని లేనిపక్షంలో అమ్మవారి ఆగ్రహానికి టీడీపీ సర్కార్ బలికాక తప్పదన్నారు.