<br/><br/>అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు వేమిరెడ్డి విజయవాడ దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.