<br/>విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సమేతంగా, పార్టీ నేతలతో కలిసి ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈ నెల 3వ తేదీన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేసిన విషయం విధితమే. <br/>