మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబునెందుకు జైల్లో పెట్టలేదు?
17 Mar 2014 5:20 PM
హైదరాబాద్, 17 మార్చి 2014:
ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడూ మిమ్మల్సి ఎందుకు జైల్లో పెట్టలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు 15 ప్రశ్నలతో ఆమె సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. సీబీఐ, ఈడీ, ఆర్వోసీ, ఎస్ఎఫ్ఐఓ, ఏసీబీ విచారణలను ఎలా తప్పించుకున్నారని నిలదీశారు. 1998 జనవరిలో నీవు చేసిన 100 ఘోరాలపై బీజేపీ ఛార్జిషీటు ప్రకటించలేదా, ఆ వెంటనే వాళ్ల కాళ్లు పట్టుకుని వారితో డీల్ కుదుర్చుకోలేదా అని వాసిరెడ్డి పద్మ తూర్పారపట్టారు. మీరు దోచుకున్నది సింగపూర్లో దాచింది నిజం కాదా? 1999 ఎన్నికల మేనిఫెస్టోలో రోజూ హైదరాబాద్ నుంచి సింగపూర్కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని చంద్రబాబు రాసుకోలేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో తరలించిన డబ్బు, బంగారం ఎంత అని చంద్రబాబు నాయుడిని ఆ లేఖలో వాసిరెడ్డి పద్మ నిలదీశారు. కోలా కృష్ణమోహన్, దొంగనోట్ల రామకృష్ణ గౌడ్, స్టాంపుల కుంభకోణం కేసులో నిందితుడు తెల్గీ, హసన్ అలీలతో నీకు ఉన్న సంబంధ బాంధవ్యాలపై విచారణకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సబ్యలు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలతో పాటు బాలాయిపల్లి భూముల కొనుగోలుపై విచారణకు సిద్ధమేనా అని డిమాండ్ చేశారు. తండ్రి ఇచ్చిన పొలాన్ని అమ్మేసినట్లు ఆయనకే చూపించిన ఘనుడివా కాదా? అన్నారు. మనీ ల్యాండరింగ్ కోసం తల్లి పేరును వాడుకోలేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
చంద్రబాబుకు పద్మ సంధించిన ప్రశ్నలివీ :
- చంద్రబాబు నాయుడూ... మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదు?
-సీబీఐ, ఈడీ, ఆర్ఓసీ, ఎస్ఎఫ్ఐఓ, ఏసీబీ విచారణల్ని ఎలా తప్పించుకున్నావ్? ఇందు కోసం ఏయే పార్టీల్ని, వ్యక్తుల్నీ ఎలా ఉపయోగించుకున్నావ్?
- 1998 జనవరిలో బీజేపీ వాళ్ళు నిన్ను శిశుపాలునితో పోలుస్తూ.. నీ 100 ఘోరాలు - నేరాలను 'ప్రజాకోర్టులో బీజేపీ చార్జిషీట్'లో ప్రచురించిన వెంటనే కంగారుపడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బీజేపీతో డీల్ కుదుర్చుకోలేదా?
- నీ సింగపూర్, మలేసియా, ఇతర దేశాల్లో ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి?
- సీమాంధ్రను దోచుకున్నది, తెలంగాణను సర్వనాశనం చేసిందీ - ఆ దోచుకున్నది సింగపూర్లో నువ్వు దాచింది నిజం కాదా?
- నీ 1999 మేనిఫెస్టోలో నువ్వే చెప్పావు. హైదరాబాద్ టు విజయవాడ ఫ్టైట్ లేదు గానీ, రోజూ హైదరాబాద్ టు సింగపూర్ విమానం నడిపేలా ఏర్పాటు చేశానని రాసుకున్నావ్. (టీడీపీ 1999 మేనిఫెస్టో - 13వ పేజీ 17వ లైను). రోజూ సింగపూర్ ఫ్టైట్లో నువ్వు అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో తరలించిన క్యాష్ ఎంత? గోల్డు ఎంత? డైమండ్సు ఎన్ని? నీ ఫ్యామిలీస్లో వాళ్ళు దిగేసుకుంటున్న వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, కెంపులు ఎవడబ్బ సొమ్ము?
- కోలా కృష్ణమోహన్, దొంగ నోట్ల రామకృష్ణ గౌడ్, భారతదేశంలోనే అతి పెద్ద స్టాంపుల కుంభకోణంలో నిందితుడు తెల్గీ, హసన్ ఆలీలతో నీకున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల మీద విచారణకు నీవు సిద్ధమేనా? మకావో ఐలాండ్సుకు మీరు ఏకంగా 5 పర్యాయాలు డీల్సు కోసం వెళ్ళింది నిజం కాదా?
- ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేశ్, ఒక నామా నాగేశ్వరరావు, ఒక మురళీమోహన్... ఇలా ఓ 10 మందిని వేల కోట్లకు పడగలెత్తించటం పరిపాలన అవుతుందా? వారి మీదా, నీ మీదా జాయింట్గా సీబీఐ లేదా మరో సంస్థతో విచారణ చేయిస్తామంటే నువ్వు రెడీనా?
- నువ్వు, నీ కుటుంబ సభ్యులు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలు అన్నింటి మీద విచారణకు నీవు సిద్ధమేనా? అది జరిగితే నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్ బయటపడి కనీసం 10 దేశాల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదా? ఈ 20 ఏళ్లలో నీ పాస్పోర్టులు, నీ కుటుంబ సభ్యుల పాస్పోర్టులు, వాటన్నింటి మీద స్టాంపింగ్లు, అందులో కాగితాలు చించివేయకుండా రిలీజ్ చేయటానికి నీవు రెడీనా?
- బాలాయిపల్లి భూముల కొనుగోలు మీద విచారణకు నీవు సిద్ధమేనా? నీ తండ్రికే నువ్వ - ఆయన ఇచ్చిన పొలాన్నే అమ్మేసినట్టు చూపావు. ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? మీ నాన్న పేరు మీద నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్ల వ్యవహారంపై దర్యాప్తుకు నీవు రెడీనా?
- చివరికి నీ తల్లిని కూడా నీ మనీ ల్యాండరింగ్ కోసం వాడుకోలేదా? ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ తన ఆస్తిని సమంగా పంచుతుంది. అలాంటిది చిత్తూరు జిల్లాలోని మీ రెండున్నర ఎకరాల నుంచి కోట్ల రూపాయలు పంట పండినట్టు లెక్కల్లో చూపించావు. నీ పొలంలో ఏమన్నా 500 రూపాయల కట్టలు, వెయ్యి రూపాయల కట్టలు పండే చెట్లు ఆ రోజుల్లోనే వేయించావా? తల్లి పేరు మీద మనీ ల్యాండరింగ్ చేసి, ఆమెకు ద్రోహం చేసిన నువ్వు అదే బుద్ధితో తెలుగుతల్లికి కూడా ద్రోహం చేసి ఈ రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, కాంగ్రెస్తో కుమ్మక్కు అయి విభజనకు అంగీకరించటం నిజం కాదా?
- జాయింట్ అకౌంట్లో డబ్బు వేయించుకుని చివరికి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల సొమ్ముని మింగేసిన చరిత్ర నీది కాదా? ఏలేరు స్కాం విచారణను ఎందుకు అడ్డుకున్నావ్? నీ పేరు మీద లేదా నీ బినామీ పేరు మీద ఇప్పటికీ ఆ జాయింట్ అకౌంట్ అలాగే ఉన్న మాట వాస్తవం కాదా? రైతుల నోరు కొట్టి సొమ్ములు తిన్న నువ్వ - గత 15 ఏళ్ళుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవకుండా పోయిన మాట వాస్తవం కాదా?
- అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయకూడదని విప్ జారీ చేసినందుకు మీకు ముట్టింది ఎంత? చిన్న వర్తకుల జీవితాలతో చెలగాటమాడే విదేశీ పెట్టుబడుల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటానికి వీలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నీ ఎంపీలు ముగ్గుర్ని గైర్హాజరు చేయించినందుకు ముట్టిందెంత? రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్కు ట్రాన్సుఫర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మీకు ట్రాన్సుఫర్ చేసిన డబ్బు ఎంత? ప్రతిసారీ ఢిల్లీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కళ్ళు గప్పి వైట్ కారులో మాయం అవుతున్నారు? ఎవరెవర్ని కలిశారు?
- రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ ముందు నడుస్తున్న గొర్రె అయితే - మీరు ఆ వెనక నడుస్తున్న గొర్రెలా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని యధాతథంగా అనుసరించారంటే ఇందులో డీల్ ఏమిటి? శాసనసభలో, శాసన మండలిలో, లోక్సభలో, రాజ్యసభలో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ మందలో ఓ వీర విధేయమైన గొర్రెలా మీరు నడిచింది ప్రజలు చూడలేదా?
- మీ అవినీతి సామ్రాజ్యం ఊడలు, కొమ్మలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాని మొదలూ వేళ్ళూ విశ్వం అంతా వేళ్ళూనుకుని ఉన్నాయి.
నిజాయితీగా రాజకీయాలు చేసేవారే అయితే.. శ్రీ జగన్మోహన్రెడ్డిలా ధైర్యంగా కేసులను ఎదుర్కొనేవారని వాసిరెడ్డి పద్మ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. జైల్లో పెట్టినా తొణకకుండా, బెణకకుండా, రాజీ పడకుండా ప్రజలనే నమ్ముకునే వారన్నారు. 14 ఏళ్ళుగా గెలవకపోవడం అంటే రాజకీయంగా యావజ్జీవ కారాగారశిక్షతో సమానం కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా ఉరికంబం ఎక్కించడానికి రాష్ట్ర విభజన వద్దన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.