రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
'ఇది బాబు బ్రాండ్ స్వరం'
07 Feb 2015 2:47 PM
హైదరాబాద్: చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపును చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట..అధికారంలోకి వచ్చిన త ర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.