రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు
25 Mar 2017 11:34 AM
ఏపీ అసెంబ్లీ: సకాలంలో వైద్యం అందక, పౌష్టికాహార లోపంతో తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మతాశిశు మరణాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నా నియోజకవర్గంలోని ఐటీడీఏ పరిధిలో 18 పీహెచ్సీలు ఉన్నాయి . రాజవొమ్మంగి మండలంలో 25 మాతాశిశుమరణాలు జరిగాయి. తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్లకి ఒక అంబులెన్స్ కూడా పంపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతన్నా మంత్రులు, అధికారులు ఇక్కడికి రాలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మా ప్రాంతానికి వచ్చి బాధితులకు భరోసా కల్పించాలి. మాతాశిశు మరణాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.