బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కోర్టులు, ప్రజాస్వామ్య విలువలు పట్టవా..!
18 Mar 2016 11:05 PM
రాజమహేంద్రవరం : న్యాయస్థానాలు, ప్రజాస్వామ్య విలువల్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వై ఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా గూండాగిరీ చే స్తూ, ప్రజాస్వామ్యం నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో మీడియాతో మాట్లాడారు.
చట్టప్రకారం ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ చెల్లనేరదని, అయినా సస్పెండ్ చేశారని అన్నారు. రోజా కోర్టు ఆర్డరు ఇచ్చి, తనను అసెంబ్లీకి రానివ్వాలని అడిగితే రావడానికి వీల్లేదంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తనవాళ్ళకు ఏవిధంగా డబ్బు కూడబెట్టాలి, ఏరకంగా భూ కబ్జాలు చేయాలి, ఇసుక, మట్టి దోపిడీ చేయాలి అనే ఆలోచనతో పనిచేస్తోందని ఆరోపించారు. టీడీపీ ని ఎన్నుకున్నందుకే తిప్పలు పడుతున్నామన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయన్నారు.