రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ పథకాల అమలుకు ఐక్యంగా కృషిచేద్దాం
13 Feb 2013 1:15 PM
హైదరాబాద్, 13 ఫిబ్రవరి 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి పలువురు ఇతర పార్టీల నుంచి బుధవారం వచ్చిన నాయకులు హైదరాబాద్ లోటస్పాండ్లో ఉన్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నివాసంలో ఆమె సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరం ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఖమ్మంలో పది సీట్లు, ఎం.పి. సీటు గెలవాలి:
పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్సభ నియోజకవర్గాన్ని గెలిపించాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా తన నివాసంలో కార్యకర్తలను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ పార్టీకి గౌరవం తెస్తూ ముందుకు సాగాలన్నారు. ఏవైనా పొరపొచ్చాలు ఉంటే వాటన్నింటినీ పక్కన బెట్టాలని, పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పనిచేయాలని ఆమె కోరారు.
అంతకు ముందు ఈ ఇద్దరు నాయకులూ ఉదయం 10.15 గంటలకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లోనే ఖమ్మం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అగ్రగామిగా నిలిచేలా అన్ని సీట్లనూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైయస్ ఆశయాల సాధనకు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషికి ప్రభావితుడై తానూ పాలుపంచుకోవాలని పార్టీలో చేరినట్లు చెప్పారు. జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. సీజీసీ సభ్యుడు డి.రవీంద్రనాయక్తో పాటు ఖమ్మం జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, ఇతర ముఖ్య నేతలు సుమారు 250 మంది ఈ సందర్భంగా హాజరయ్యారు.
తుని మున్సిపల్ మాజీ చైర్మన్ చేరిక: :
తుని మున్సిపల్ మాజీ చైర్మన్ కూసుమంచి శోభారాణి బుధవారం ఉదయం శ్రీమతి వైయస్ విజయమ్మను కలిసి ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాను మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. వాటిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె అన్నారు. తుని నియోజకవర్గం పార్టీ నాయకుడు తాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. లోవ దేవస్థానం చైర్మన్ లాలం బాబ్జి, స్థానిక బీసీ నాయకుడు మాకినీడు గంగారాం కూడా పార్టీలో చేరారు. విజయమ్మ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.