వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ టియుసి దేశ వ్యాప్త సమ్మె పిలుపు
27 Jan 2013 3:11 PM
విశాఖపట్నం, 27 జనవరి 2013: వచ్చే ఫిబ్రవరి 21, 22 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. జనక్ ప్రసాద్ పిలుపు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం, కార్మిక చట్టాలు అమలు కాకపోవడానికి నిరసనగా ఆ రెండు రోజుల్లో సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్మిక సంఘాలన్నీ ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆదివారంనాడు విశాఖపట్నంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
వివాదాస్పద 26 జీఓలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని, అయితే, ఆ జీఓలతో సంబంధమే లేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని మాత్రం కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై జైలుకు పంపాయని జనక్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.