వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ కాంగ్రెస్తోనే సంక్షేమం సాధ్యం
12 Jan 2013 11:11 AM
తిరుపాడు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా తిరుపాడు, పైబోగుల, ఉండుట్ల గ్రామాల్లో మండల కన్వీనర్ వై.శివరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నా రైతుల పొలాలకు నీరు పెట్టుకునే వీల్లేకుండా కరెంట్ కోతలు విధిస్తున్నారన్నారు.