వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ మెరుపు ధర్నా

హైదరాబాద్, 26 మార్చి 2013: శానససభ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా శాసనసభ సమావేశాలను అర్ధంతరంగా వాయిదా వేయడానికి నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ రెండవ నెంబర్‌ గేటు వద్ద వారు ఈ మెరుపు ధర్నా చేపట్టారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు‌ డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని ‌పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

కాగా, ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే,‌ పోలీసు స్టేషన్ బయట కూడా ఎమ్మెల్యేలు ధర్నా చేశారు.‌ పోలీసులు విజ్ఞప్తి చేయడంతో కొద్దిసేపటి తరువాత వారు తమ ఆందోళనను విరమించుకున్నారు.
Back to Top