మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వాడపల్లినుంచి మొదలైన మరో ప్రజాప్రస్థానం
23 Feb 2013 12:07 PM
నల్గొండ 23 ఫిబ్రవరి 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శనివారం ఉదయం ప్రారంభించారు. తొలుత ఆమె దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. నల్గొండ జిల్లా వాడపల్లిలో యాత్రను మొదలుపెట్టారు. వాడపల్లి వంతెన మీదుగా పొందుగుల గ్రామం వద్ద గుంటూరు జిల్లాలోకి యాత్ర అడుగిడనుంది. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. శనివారం ఆమె 9 కిలోమీటర్ల దూరం నడుస్తారు. రాత్రికి పులిపాడు క్రాస్ వద్ద ఆమె బస చేస్తారు. ఈ నెల18నే పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక రోజు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు, తదుపరి హైదరాబాద్లో సంభవించిన బాంబు పేలుళ్లలో మృతులకు సంతాప సూచకంగా ఒకరోజు యాత్రను వాయిదా వేసుకున్నారు.